వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా సేవా కార్యక్రమలు నిర్వహించిన అభిమాని శ్రీ కొణతం సూర్యనారాయణ రెడ్డి
పేదల గుండెచప్పుడు, మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి సందర్బంగా వై యస్ అభిమాని గుంటూరు జిల్లా గురజాల కి చెందిన వీరాభిమాని, వైసీపీ నాయకుడు, గురజాల ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి అనుచరుడు కొణతం సూర్యనారాయణ రెడ్డి , గురజాల లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం గురజాల పట్టణంలోని అనిగ్రేస్ వృద్ధాశ్రమం లోని వృద్దులు కి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, దాచేపల్లి సెంటర్ లో ౩౦౦ మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు. కొణతం సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడతూ దివంగత మహానేత వైఎస్సార్ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు కొనియాడారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన గొప్ప నేత అని, అభివృద్ధి విషయంలో వైఎస్సార్ రాజకీయాలు చూడలేదని, వైఎస్సార్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైయస్సార్ సీపీ నాయకులు పాల